class-1st-to-8th-class-semister-wise-books-Telugu-English-medium-books

class-1ST-to-8th-class-semister-wise-books-Telugu-English-medium-books

8 వరకు ‘సెమిస్టర్‌’ పుస్తకాలు.. పాఠశాల విద్యాశాఖ కసరత్తు..*

              రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1-8 తరగతుల పాఠ్య పుస్తకాలను సెమిస్టర్ల వారీగా అందించనున్నారు. 1-7 తరగతుల పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ముద్రించారు. తెలుగు పాఠం పక్కనే ఆంగ్ల పాఠం ఉంటుంది.

గతేడాది 1-6 పాఠ్య పుస్తకాలను మార్పు చేయగా.. ఈ ఏడాది ఏడో తరగతి పుస్తకాలు మారాయి. ఎనిమిదో తరగతి పాత పాఠ్యాంశాలనే రెండుగా విభజించి సెమిస్టర్లుగా ముద్రించారు.

ఇప్పటికే ఒక సెమిస్టర్‌ పుస్తకాలను మండల స్థాయి వరకు సరఫరా చేశారు*. 

               6, 7, 8 పాఠ్య పుస్తకాలు రెండు సెమిస్టర్లుగా ఉండగా.. 1-5 వరకు మూడు సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. పరీక్షల విధానం, తరగతి గది బోధనలోనూ మార్పులు తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

ఇందుకు జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ), ప్రభుత్వ పరీక్షల విభాగాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.*

             విద్యార్థుల విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రం తయారు చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏ పాఠశాలకు ఆ పాఠశాలలోనే చేస్తున్నారు.

ఈ ప్రక్రియ సమగ్రంగా ఉండటం లేదని విద్యాశాఖ అభిప్రాయ పడుతోంది.

పరీక్షలు ముగిశాక జవాబు పత్రాలను మరొక పాఠశాలకు పంపి మూల్యాంకనం చేయించాలని భావిస్తోంది.