ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు.
రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు
విజయవాడ ఫార్ట్యూన్ మురళి లో 12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
విద్యార్థులు తమ ఫలితాలను వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
http://bie.ap.gov.in/ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP Inter Results విడుదలైన అనంతరం https://bie.ap.gov.in/ వెబ్సైట్ల ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్కు అర్హత సాధిస్తారు.