ప్రమోషన్లకు వేళాయె
ఏడాది తరువాత ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు
వెబ్ సైట్ లో సీనియార్టీ జాబితాలు
25న గ్రేడ్-2 హెచ్ఎంల కౌన్సెలింగ్
29,30 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు
విద్యాశాఖలో ఉద్యోగోన్నతులకు వేళయింది. ఈ నెల 25వ తేదీన స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 హెచ్ఎంలుగా, 29, 30న ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.. ఈ మేరకు డీఈఓ కార్యాలయ అధికారులు సీని యార్టీ జాబితాలను శనివారం ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమా న్యాల పరిధిలోని స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందను న్నారు. ఒకే సారి ఇంతమం దికి ఉద్యోగోన్నతులు లభిస్తుండటంపై ఉపా ధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి.
సీనియార్టీ జాబితాలు విడుదల
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరి షత్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసెస్టింట్ కేడ ర్లలో పనిచేస్తూ ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను శనివారం. డీఈఓ వెబ్సైట్లో ప్రకటించారు. ఈ నెల 23న ఉద్యోగోన్నతులకు అర్హులైన వారి ఫైనల్ జాబి తాను ప్రకటిస్తారు.
ఖాళీలపై కసరత్తు
తాజా ఉద్యోగోన్నతుల్లో భారీ సంఖ్యలోనే ఉపాధ్యాయులకు మేలు జరుగనుం ది. 2020 నవంబర్ ఒకటో తేదీ తరువాత ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగోన్నతులు కల్పించేలా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ కొనసాగనుంది.
జాబితాలను పరిశీలించుకోవాలి
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తాం. కేడర్ల వారీగా సీనియార్టీ జాబితాలను వెబ్సైట్లో ఉంచాం. ఉపాధ్యాయులు వాటిని పరిశీలించు కోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తగిణ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.