ysr-raithu-bharosa-financial-assurance-farmers-Rs4000

ysr-raithu-bharosa-financial-assurance-farmers-Rs4000

ఏపీలో రైతులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బులు జమ

Ysr Rythu Bharosa Funds 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది . ఈ నెల 7వతేదీన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 అందజేస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించి.. రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు.
ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించారు. తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. రాష్ట్రంలో అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీ(ఆర్‌వోఎఫ్‌ఆర్‌) భూములను సాగు చేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు కూడా తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం.
అర్హత పొందిన 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు 7వ తేదీన రెండో విడతగా రూ.2,204.77 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఈ మొత్తంతో కలిపితే ఈ ఏడాది రూ.6,147.72 కోట్ల సాయాన్ని అందుకున్నట్లవుతుంది. 

వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్  2023-2024

వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల*

YSRRB(2023-24) Payment Status LINK


 https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus

YSR RYTHU BHAROSA OFFICIAL WEBSITE LINK

తాజాగా జమ చేయనున్న రెండో విడత సాయంతో కలిపితే గత నాలుగున్నరేళ్లలో సగటున 53.53 లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందచేసినట్లవుతుంది.

రాష్ట్రంలో రైతులు అందరూ ఉచిత పంటల బీమా కింద లబ్ధి పొందుతున్నారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఖరీఫ్ పంట నైరుతి రుతు పవనాల మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట కొంత విస్తీర్ణం తగ్గిందని.. నీరందక పంట నష్టపోయిన వారికీ పంటల బీమాను అందిస్తున్నామన్నారు. 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని.. రబీ కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేశామననారు. రైతు భరోసా రైతులకు ఇచ్చాం.. 7వ తేదీన మరోసారి ఇస్తున్నాం అని తెలిపారు.