How-to-find-local-non-non-local-for-teachers-details

How-to-find-local-non-non-local-for-teachers-details

స్థానికత ఎలా?

కొత్త జిల్లాలతో ఉపాధ్యాయుల్లో టెన్షన్

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్లను పాఠశాల విద్యాశాఖ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉపాధ్యాయులంతా విద్యార్థులు పరీక్షలపై దృష్టిసారించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో బదిలీలు, పదోన్నతులు ఎలా ఉంటాయనే అంశం పై వారిలో ఆందోళన నెలకొంది. పరిపాలన సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాను రెండు, మూడు కొత్త జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వీస్ మ్యాటర్స్పై ప్రభుత్వం నుంచి ఎటువంటి విధివిధానాలూ వెలువడలేదు. దీంతో తాము పాత జిల్లానా, కొత్త జిల్లానా? అనే అయోమయంలో ఉపాధ్యాయులు ఉన్నారు. స్థానికత ఎలా తీసుకుంటారోననే ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు చెందిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. జిల్లాల విభజనతో ఆయన స్థానికత మచిలీపట్నంకు వస్తుంది. సర్వీస్ రిజిస్టర్ ప్రకారం బదిలీ చేస్తే ఆయన మచిలీపట్నంకు బదిలీ అవుతారు. అదేవిధంగా భార్యభర్తల బదిలీలు, వారి స్థానికతను ఎలా తీస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. సర్వీస్ రిజిస్ట్రర్ ప్రకారం బదిలీ చేస్తే సమస్యలు వస్తాయని ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఆప్షన్ మేరకు బదిలీ చేపడితే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. బదిలీలు చేపట్టిన తరువాత పోస్టింగ్ ఉత్తర్వులు కొత్త జిల్లా డిఇఒ ఇస్తారా?, పాత జిల్లా డిఇఒ ఇస్తారా? అనే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికనే ఉపాధ్యాయ బదిలీలను చేపట్టింది. ఉత్తర్వులను డిఇఒతో కాకుండా ప్రాంతీయ విద్యాశాఖ అధికారి (ఆర్జేడీ)తో ఇప్పించారు. జిల్లాలు విభజించిన తెలంగాణలో ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదు. జోనల్ విధానం కూడా మారుతుందా? ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను కొనసాగిస్తారా? లేదా పెంచుతారా? తేలాల్సి avast premier 2016 serial number ఉంది. జోన్లలో మార్పులు చేసినా, చేయకపోయినా క్యాడర్ డిక్లరేషన్ కోసం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత మాత్రమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

ఈరోజు నుండి జిల్లాలను విభజిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా వారు కోరుకున్న జిల్లాలకు బదిలీలు చేపడతారు ఆ బదిలీలు ఎలా చేపడతారు అనేది ఈ కింద వివరించడం జరిగింది. ఇది కేవలం ఉపాధ్యాయుల అవగాహన కొరకు మాత్రమే పూర్తి అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది

*జిల్లాల విభజన నేపథ్యంలో ఉపాధ్యాయులు Option ఇచ్చే విధానం ఇలా ఉంటుంది….*

ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలుగా విభజించబడింది.ప్రతి జిల్లాలో ఉన్న పాఠశాలలకు/ రోలు కు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను విభజించి ఏ జిల్లాకు ఆ జిల్లా కేడర్ స్ట్రెంగ్త్ రూపొందిస్తారు.

అప్పుడు ప్రతి జిల్లాకు ఎన్ని గజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు మరియు ఇతర ఉపాధ్యాయ పోస్ట్ లు కావాలో నిర్ణయిస్తారు.

ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు option form పూర్తి చెయ్యాలి.

కాకినాడ, రాజమండ్రి, అమలాపురం లలో ఏ జిల్లాకు ఆప్షన్ ఇచ్చుకుంటారో 1,2,3 గా preference ఇవ్వాలి.అప్పుడు మన సీనియారిటీని బట్టి మనం ఎంచుకున్న మొదటి ఆప్షన్ వస్తే ఆ జిల్లా కేటాయించబడుతుంది. ఒకవేళ మన సీనియారిటీకి మనం మొదటిగా ఇచ్చుకున్న జిల్లా రాకపోతే అప్పుడు రెండవ జిల్లా…ఆపై మూడవ జిల్లా ఇస్తారు.

ఒకవేళ కాకినాడ జిల్లాకు 1000 మంది ఉపాధ్యాయులు అవసరం అయిఉండి 800 మంది మాత్రమే option ఇచ్చుకుంటే అప్పుడు కావలసిన 200 మంది ఉమ్మడి జిల్లా సీనియారిటీని బట్టి రివర్స్ సీనియారిటీలో కంపల్సరీగా బదిలీ చేయబడతారు.

ఉదాహరణకు కాకినాడ జిల్లాలోకల్ గా చెందిన ఉపాధ్యాయుడు కాకినాడ జిల్లానే మొదటి ఆప్షన్ గా ఇచ్చుకుని మరియు అతనికి కాకినాడ జిల్లా కేటాయించబడితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాల మారడు. అదే పాఠశాలలో పనిచేస్తాడు. ( ఎనిమిది సంవత్సరాలు నిండినా సరే మారడు. బదీలీలు ఇచ్చినపుడు మాత్రం మారాల్సివస్తుంది)

ఏ ఉపాధ్యాయుడికైనా తన మొదటి option జిల్లా రాకపోతే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు స్థానం మారాల్సి వస్తుంది.

ఈ విధంగా మొదట ఉపాధ్యాయులను ఆయా జిల్లాలకు సర్దుబాటు చేసినతరువాత అప్పుడు ఆయా జిల్లాలలోని మండలాలను కోరుకోవడానికి option ఇచ్చుకోవాలి.

error: Content is protected !!