ప్రవేశాలు, బేస్లైన్ టెస్ట్, వర్క్షీట్లు, బుక్లెట్లు వంటి వాటి కోసం విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలని ఉపాధ్యాయులకు నిర్దేశించాం. తల్లిదండ్రుల సహకారంతోనే ఇదంతా జరిగేలా దిశానిర్దేశం చేస్తున్నాం.
*ఇదీ కార్యాచరణ..
ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఇళ్ల దగ్గరే బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకుని సాధన పత్రాలను వారి ద్వారా విద్యార్థులకు అందజేసి జవాబులు రాసిన అనంతరం రప్పించుకోవాలి.
28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మూల్యాంకనం చేయాలి.
2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత తరగతుల్లో విద్యాకానుకలో అందజేసిన వర్క్బుక్స్ను సాధన చేయాలి.
4 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు తాజాగా అందజేయనున్న అధ్యయన దీపికలు, సాధనపత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.
ఇదే సందర్భంలో కార్యాచరణ మేరకు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యే పాఠాలను అనుసరించాలి.