*రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు:*
*సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు:*
ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.
*తరగతి ఉపాధ్యాయులకు సూచనలు:*
తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.
*విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు:*
ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27 నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను. ఆ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను *”కీ”* ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.
1) అన్ని పాఠశాలలో అన్ని తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహణ చేయాలి .
2)క్రింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాల అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇచ్చారు.
వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష పత్రాలు తయారు చేసి నిర్వహణ చేయాలి .
3) ఎట్టి పరిస్థితుల్లో విధ్యార్థుల ను పాఠశాల కు పిలవరాదు.
4) తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి.
*5) పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31 వరకు.*
*6) మూల్యాంకనం జూలై 28 నుండి 3 ఆగస్టు.*
*7)మార్కుల నమోదు 4 ఆగస్టు నుండి 10 వరకు.*
level 1 1&2 తరగతులకు
level 2 3,4&5 తరగతులకు.
level 3 6 నుండి 10 తరగతులకు
8) తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విడి విడిగా ప్రశ్న పత్రాలను అందజేయాలి.
పై అంశం సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాలి.
వారి అభ్యసనసామర్థ్యాల అంచనాకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు బేస్లైన్ పరీక్షలను నిర్వహించనుంది.
వచ్చే నెల 4 నుంచి సాధన పత్రాలకు జవాబులు రాయించాలని సూచించింది.
*♦ఇళ్ల దగ్గరే సాధన..*
సాధనపత్రాలకు జవాబులను విద్యార్థులు తమ ఇళ్ల దగ్గరే రాయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మార్గదర్శకాలను జారీ చేశారు.
ప్రవేశాలు, బేస్లైన్ టెస్ట్, వర్క్షీట్లు, బుక్లెట్లు వంటి వాటి కోసం విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలని ఉపాధ్యాయులకు నిర్దేశించాం. తల్లిదండ్రుల సహకారంతోనే ఇదంతా జరిగేలా దిశానిర్దేశం చేస్తున్నాం. అధ్యయన దీపికలు(బుక్లెట్లు), సాధనపత్రాలు(వర్క్ షీట్లు) డీసీఈబీ ఆధ్వర్యంలో ముద్రణకు చర్యలు తీసుకున్నాం.
నిర్దేశిత ప్రణాళిక మేరకు పాఠశాలలకు సరఫరా చేయనున్నాం. జిల్లా విద్యాశాఖాధికారి
*ఇదీ కార్యాచరణ..
ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఇళ్ల దగ్గరే బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకుని సాధన పత్రాలను వారి ద్వారా విద్యార్థులకు అందజేసి జవాబులు రాసిన అనంతరం రప్పించుకోవాలి.
28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మూల్యాంకనం చేయాలి.
2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత తరగతుల్లో విద్యాకానుకలో అందజేసిన వర్క్బుక్స్ను సాధన చేయాలి.
4 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు తాజాగా అందజేయనున్న అధ్యయన దీపికలు, సాధనపత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.
ఇదే సందర్భంలో కార్యాచరణ మేరకు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యే పాఠాలను అనుసరించాలి.