ysr-raithu-bharosa-pm-kisan-financial-assurance-farmers-Rs7500
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.
50.37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా
ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు.
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది.
అన్నదాతలకు అడుగడుగునా అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా లబ్ధి కలిగిస్తోంది. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సేద్యానికి మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగుకోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది.
YSR RAITHU BHAROSA PAYMENT STATUS CLICK HERE
RAITHU BHAROSA OFFICIAL WEBSITE CLICK HERE
pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link