central-government-new-rules-about-PPF-account

కేంద్రం కొత్త రూల్స్.. ఈ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్!

మీరు పీపీఎఫ్ స్కీమ్‌లో చేరారా? ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీరు పీపీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పథకంలో చేరిన వారికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక పీపీఎఫ్ అకౌంట్ మాత్రమే ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే.. వాటికి పీపీఎఫ్ బెనిఫిట్స్ లభించవు. వీటిని ఇరెగ్యులర్‌గా పరిగణిస్తారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి కన్నా ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు కలిగిన వారికి తీపికబురు అందించింది. వీటిని విలీనం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వీటి ప్రకారం చూస్తే..

పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లలో ఒకటి కన్నా ఎక్కువగా ఓపెన్ చేసిన పీపీఎఫ్ అకౌంట్లను విలీనం చేసుకోవచ్చు. రెండు వేర్వేరు ఆపరేటింగ్ ఏజెన్సీల్లో పీపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్నప్పుడు అకౌంట్‌దారుడు అకౌంట్ల విలీనం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఒకే ఆపరేటింగ్ ఏజెన్సీలో ఎక్కువ ఖాతాలు ఉంటే సులభంగానే ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు.

కాగా పీపీఎఫ్ ఖాతాపై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేసినా చాలు అకౌంట్ కొనసాగుతుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సరీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంకా లోన్ కూడా పొందొచ్చు.

error: Don\'t Copy!!!!