Begum Hazrat Mahal National Scholarship Scheme-2021-DETAILS
SCHEME OF
“BEGUM HAZRAT MAHAL NATIONAL SCHOLARSHIP”
FOR MERITORIOUS GIRL STUDENTS BELONGING TO THE MINORITY COMMUNITIE
మైనారిటీ బాలికల కోసం బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్.
మైనారిటీ బాలికలకు స్కాలర్షిప్లు.. 9, 10 బాలికలకు నెలకు రూ. 5వేలు.. ఇంటర్ వాళ్లకు రూ.6 వేలు
ప్రతిభ కలిగిన మైనారిటీ బాలికల చదువును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తోంది. ఢిల్లీలోని మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది. ఇది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.
అర్హతలు
తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదువున్న మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలు) బాలికలు ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రెండు లక్షలకు మించకుండా ఉండాలి. అకడమిక్ మెరిట్ పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. చదువు మ«ధ్యలో మానేసిన వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర స్కాలర్షిప్స్ పొందేవారు అనర్హులు.
నేరుగా ఖాతాకే
ఈ స్కాలర్షిప్స్కు ఎంపికైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రూ.5000, అలాగే 11, 12 తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6000 స్కాలర్షిప్గా అందిస్తారు. విద్యార్థి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా సదరు మొత్తాన్ని జమచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
నేరుగా ఖాతాల్లో జమ:
9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ.5 వేలు,
ఇంటర్మీడియట్ వారికి నెలకు రూ.6 వేల చొప్పున స్కాలర్షిప్పులు ఇస్తారు.
ఈ మొత్తం ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల ఖాతాలో జమవుతుంది.
స్కాలర్షిప్పు పొందినవాళ్లు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్నవారు దీనికి అనర్హులు.
ముఖ్య సమాచారం:
-
అర్హత: తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం తరగతుల్లో ఉన్న మైనార్టీ వర్గాల విద్యార్థినులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలకు చెంది ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. ముందు తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
-
ఎంపిక: అకడమిక్ మెరిట్, కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.
-
దరఖాస్తు విధానం: అర్హతలున్న మైనారిటీ బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఫీజు చెల్లించనవసరం లేదు. స్కూల్ వెరిఫికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదుచేసి ఫొటో అతికించి, దానిపై ప్రిన్సిపల్ సంతకం, స్కూల్ స్టాంప్ వేయించాలి. అనంతరం ఈ ఫారాన్ని స్కాన్చేసి అప్లికేషన్తోపాటు అప్లోడ్ చేయాలి. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నీ జతచేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ పంపాల్సిన అవసరం లేదు.