పురపాలక ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్
లాంగ్వేజ్ పండిట్ మినహా..
6 లోపు సీనియారిటీ జాబితా ప్రకటన
14న ఖాళీల జాబితారూపకల్పన
15 నుంచి కౌన్సెలింగ్
పురపాలక ఉపా ధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్ (లాం గ్వేజ్ పండిట్) మినహా అన్ని కేటగిరీల్లో పదోన్నతులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మి నిస్ట్రేషన్(సీడీఎంఏ) ఎంఎం నాయక్.. రీజనల్ డైరెక్టర్లను, కమిషన ర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.
3(శు క్రవారం) నుంచి 6వ తేదీ మధ్య సీనియారిటీ జాబితా ప్రకటన,
7 నుంచి 9వ తేదీల్లో అభ్యంతరాల స్వీక రణ,
10 నుంచి 13 తేదీల్లో అభ్యంత రాల పరిశీలన, పరిష్కారం ఉంటుంది.
14న ఖాళీల జాబితా రూపకల్పన, ఆ తర్వాత 15 నుంచి 17వ తేదీల్లో కౌన్సెలింగ్ చేపడతారు. పదోన్నతుల ద్వారా సుమారు 250 పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది.